కర్నూలులో పేలిన నాటుబాంబులు

By Newsmeter.Network  Published on  25 Feb 2020 4:01 PM GMT
కర్నూలులో పేలిన నాటుబాంబులు

కర్నూలు జిల్లాలోని సంజామల మండలం అక్కంపల్లెలో నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన వైసీపీ నేత శివారెడ్డి పాత ఇంటి గోడల్లో దాచి ఉంచిన బాంబులు ఒక్కసారిగా పేలాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story