కొవ్వత్తి తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
By Medi Samrat Published on 5 July 2020 7:55 PM ISTఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఆదివారం ఘజియాబాద్లోని కొవ్వత్తి తయారీ కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఘటనలో గాయపడిన వారిని వెంటనే.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం.
ఘజియాబాద్లోని మోదీ నగర్.. తహసీల్ పరిధిలో బాకర్వా గ్రామంలోని కొవ్వత్తి కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు.
उ.प्र. CM ने गाजियाबाद के मोदीनगर के बखरवा गांव में मोमबत्ती कारखाने में आग लगने की घटना में DM एवं वरिष्ठ पुलिस अधीक्षक को मौके पर पहुंचकर घटना के घायलों को तत्काल राहत पहुंचाने के निर्देश दिए हैं और घटनास्थल की जांच कर आज शाम तक रिपोर्ट प्रस्तुत करने को कहा है: उत्तर प्रदेश CMO https://t.co/IP7vHb8SmG pic.twitter.com/eYZWst7J3R
— ANI_HindiNews (@AHindinews) July 5, 2020
పేలుళ్ల ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో.. కార్మికులు బయటకు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే మంటలు వ్యాపించడంతో కొందరు సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. మంటల వ్యాప్తి నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పేలుళ్ల ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఘటనలో గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి.. వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.