టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండతో సహా పలువురు ప్రముఖులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్ల నుంచి పొందిన పారితోషికం, కమీషన్ల వివరాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో పాటు మరో సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్కూ ఇదే కేసులో సిట్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ నిషేధిత బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.