వీరసింహారెడ్డి నుంచి స్పెషల్ అప్డేట్.. 'మా బావ మనోభావాలు'
Veera Simha Reddy special song releasing on December 24.నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం వీర సింహా రెడ్డి
By - తోట వంశీ కుమార్ |
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'వీర సింహా రెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, 'జై బాలయ్య', 'సుగుణ సుందరి' పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో మరో అదిరిపోయే అప్డేట్ను ఇచ్చింది. 'మా బావ మనోభావాలు' అంటూ సాగే స్పెషల్ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. న్యూఇయర్ పార్టీల్లో స్పీకర్లు పగిలిపోవాలా, థియేటర్లలో మోత మోగిపోవాలా అంటూ ఓ స్పెషల్ పోస్టర్తో డిసెంబర్ 24న పాటను విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొత్త పోస్టర్లో బాలయ్య గెటప్ అదిరిపోయింది.
New year parties lo Speaker lu pagilipovala, Theatres lo motha Mogipovala 🤙🤙#MaaBavaManobhavalu song from #VeeraSimhaReddy on Dec 24th at 3:19 PM 💥
— Mythri Movie Makers (@MythriOfficial) December 21, 2022
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/45BWvmcpgF
కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.