మరో తమిళ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ ఖరారు..ఇదిగో గ్లింప్స్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో తమిళ డైరెక్టర్ కనగరాజ్ కాంబోలో నటించబోతున్నారు.
By - Knakam Karthik |
మరో తమిళ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ ఖరారు..ఇదిగో గ్లింప్స్
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగి రికార్డులు క్రియేట్ చేసిన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో తమిళ డైరెక్టర్ కనగరాజ్ కాంబోలో నటించబోతున్నారు. కాగా ఈ కాంబోలో సినిమాను కన్ఫార్మ్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ అధికారికంగా ప్రకటించింది. ఎప్పటినుంచో ఊహాగానాల రూపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు బుధవారం భోగి పండుగ సందర్భంగా ప్రకటించారు. AA23 అనే వర్కింగ్ టైటిల్తో ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్కు యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. కథ ఇప్పటికే ఖరారైందని, స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది.
ఇప్పటికే అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. AA22xA6 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ కథానాయికలు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక బన్నీ కొంత విరామం తీసుకుని లోకేశ్ కనగరాజ్ సినిమా సెట్స్లో అడుగుపెడతారు.
Blessed with the best @alluarjun #AALoki Looking forward to kicking off this journey with you sir 🤗Let's make it a massive blast 💥💥💥Once again with my brother @anirudhofficial 💥💥#AA23 #LK7 @MythriOfficial pic.twitter.com/AZpufiNI2t
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) January 14, 2026