సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం'..ఓటీటీ డేట్ ఫిక్స్
సినీ నటి సమంత నిర్మాతగా వచ్చిన తొలి మూవీ 'శుభం' ఓటీటీ రిలీజ్కు డేట్ ఫిక్స్ అయింది.
By Knakam Karthik
సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం'..ఓటీటీ డేట్ ఫిక్స్
సినీ నటి సమంత నిర్మాతగా వచ్చిన తొలి మూవీ 'శుభం' ఓటీటీ రిలీజ్కు డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన తర్వాత, ఈ హారర్ కామెడీ చిత్రం జూన్ 13, 2025 నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రస్తుతానికి తెలుగులో అందుబాటులో ఉంటుంది. మే 9, 2025న విడుదలైన ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి మరియు షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. సమంత కూడా ఈ సినిమాలో చిన్నదైన కానీ స్వీట్ క్యామియోలో కనిపిస్తుంది.ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంస్థ పోస్టర్ విడుదల చేసింది. ‘చచ్చినా చూడాల్సిందే’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది.
కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్తో నటించిన సమంత మయోసైటీస్ కారణంగా కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరగా ఖుషి మూవీలో కనిపించారు. ఆ గ్యాప్ను పూర్తి చేసేందుకు మళ్లీ నిర్మాతగా మారి శుభం అనే మూవీని ప్రొడ్యూస్ చేశారు. ట్రలాలా పిక్చర్స్ అండ్ బ్యానర్స్ పేరుతో జర్నీ స్టార్ట్ చేసింది. అయితే ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.