రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
Punjab Women Can Travel free in buses. పంజాబ్ ప్రభుత్వం మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on
31 March 2021 1:38 PM GMT

పంజాబ్ ప్రభుత్వం మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. తమ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఈ అవకాశం కల్పించనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలు, బాలికలు ప్రయోజనం పొందనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ప్రభుత్వానికి చెందిన బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తూ ముందకు తెచ్చిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం పొందడం హర్షనీయమని రాసుకొచ్చారు. మహిళా సాధికారతకు ఇది బలమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా కూడా ఉందని ట్వీట్ చేశారు.
Next Story