అవును.. ఆ దర్శకుడు చనిపోయారు..!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన గుజరాతీ ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ కలావాడియా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

By M.S.R
Published on : 21 Jun 2025 2:39 PM IST

అవును.. ఆ దర్శకుడు చనిపోయారు..!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన గుజరాతీ ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ కలావాడియా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. మహేశ్ కుటుంబ సభ్యుల డీఎన్ఏతో ఓ మృతదేహం డీఎన్ఏ సరిపోలడంతో మహేశ్ మృతిని నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తర్వాత మహేశ్ కనిపించకుండా పోవడం, ప్రమాద స్థలంలో మహేశ్ స్కూటర్, మొబైల్ లభించాయి.

అహ్మదాబాద్ లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో 241 మంది, నేలపై ఉన్న 29 మంది సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలానికి సమీపంలోని షాహీబాగ్‌లో కాలిపోయిన స్థితిలో ఒక యాక్టివా స్కూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో అది మహేశ్ జిరావాలాకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆయన మొబైల్ ఫోన్ చివరిసారిగా క్రాష్ సైట్ సమీపంలోనే పనిచేసినట్లు ట్రేస్ అయింది. ప్రమాదం జరిగిన రోజు మధ్యాహ్నం లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలిసేందుకు మహేశ్ వెళ్లారని ఆయన భార్య హేతల్ తెలిపారు.

Next Story