తునీషా శర్మ ఆత్మహత్య కేసు : షీజన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Maharashtra court grants bail to Sheezan Khan. తునీషా శర్మ ఆత్మహత్య కేసులో నటుడు షీజన్ ఖాన్‌కు మహారాష్ట్ర కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.

By Medi Samrat  Published on  4 March 2023 8:34 AM GMT
తునీషా శర్మ ఆత్మహత్య కేసు : షీజన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Tunisha Sharma, Sheezan Khan


తునీషా శర్మ ఆత్మహత్య కేసులో నటుడు షీజన్ ఖాన్‌కు మహారాష్ట్ర కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై షీజన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది చివర్లో శర్మ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై షీజన్ ఖాన్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలులో ఉంచారు. షీజన్ ఖాన్, తునీషాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.. కానీ తర్వాత ఇద్ద‌రు విడిపోయారు. తునీషా డిసెంబర్ 24, 2022న వలివ్ సమీపంలో ఒక టీవీ సీరియల్ సెట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తునీషా తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు షీజన్ ఖాన్‌ను మరుసటి రోజు అరెస్టు చేశారు.


Next Story