అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్ కు గురి చేసింది. దీంతో కన్నప్ప టీమ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ట్రైలర్ రిలీజ్ను వాయిదా వేసింది కన్నప్ప టీమ్. ఇండోర్లో రేపటి ప్రీరిలీజ్ ఈవెంట్ను రద్దు చేసింది ‘కన్నప్ప’ టీమ్. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంచు విష్ణు సంతాపం తెలిపారు. తీవ్ర దుఃఖంలో ఉన్నామని, ఇలాంటి సమయంలో ‘కన్నప్ప’ ట్రైలర్ను రిలీజ్ చేయలేమంటూ విష్ణు ట్వీట్ చేశారు.
'ఈరోజు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన నా హృదయాన్ని కలచివేసింది. తీవ్ర దుఃఖంలో, కనప్ప ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నాము. రేపటి ఇండోర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో నా ప్రార్థనలు విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు తోడుగా ఉంటాయి' అని మంచు విష్ణు ట్వీట్ వేశారు.