జపాన్‌లో సాయి పల్లవి

సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Feb 2024 7:00 AM GMT
heroine saipallavi,  japan, bollywood,

జపాన్‌లో సాయి పల్లవి

సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమె సినిమా సెట్స్ కు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. జపాన్‌లోని సపోరో స్నో ఫెస్టివల్‌లోని సుందరమైన మంచుతో కూడిన వండర్‌ల్యాండ్‌లో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటిస్తూ ఉంది సాయి పల్లవి. జునైద్ ఖాన్ మొదటి చిత్రం 'మహారాజ్' ఈ సంవత్సరంలో విడుదల కానుంది. ఇంతలోనే స్టార్‌కిడ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం షూటింగ్ ప్రారంభించాడు. జునైద్ తన రెండో సినిమాలో సాయి పల్లవితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం కనిపిస్తుంది.

సాయి పల్లవి కొంచెం గ్యాప్ తర్వాత పలు ప్రాజెక్ట్‌లను చేస్తోంది. ఆమె ప్రస్తుతం చందూ మొండేటి "తండేల్"లో నాగ చైతన్యతో కలిసి పని చేస్తోంది. త్వరలో ఆమె యష్‌తో కలిసి కనిపించే అవకాశం ఉందని.. నితీష్ తివారీ రామాయణంలో సీతను పోషించనున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. జునైద్ తొలి చిత్రం 'మహారాజా' నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో జైదీప్ అహ్లావత్, శర్వరి వాగ్, షాలిని పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Next Story