20 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై నితిన్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. వైర‌ల్‌

Hero Nithiin shares emotional post about his 20 years journey.జ‌యం చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు హీరో నితిన్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2022 8:11 AM GMT
20 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై నితిన్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. వైర‌ల్‌

'జ‌యం' చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు హీరో నితిన్‌. తొలి చిత్రంతోనే ఘ‌న విజ‌యాన్ని అందుకున్న ఈ హీరో.. హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉన్నాడు. ఇక యూత్‌లో నితిన్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే.. జ‌యం చిత్రం విడుద‌లై, నితిన్ త‌న సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానుల‌కు, త‌న‌తో ప‌ని చేసిన ద‌ర్శ‌క‌నిర్మాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు నితిన్‌.

'ఇర‌వై సంత్స‌రాల క్రితం జ‌యం చిత్రంతో ఇదే రోజు నా సినీ ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టాను. దీన్ని ఎలా వ‌ర్ణించాలో కూడా మాట‌లు రావ‌డం లేదు. ఒక న‌టుడిగా నన్ను గుర్తించి, మొద‌టి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు తేజ గారికి హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. అలాగే నా సినీ ప్ర‌యాణంలో అండ‌గా నిలిచిన ప్ర‌తి సినిమా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు. మీరంద‌రూ లేక‌పోతే నేను ఎక్క‌డ ఉండేవాడినో అంతేకాదు.. అంద‌మైన ప్ర‌యాణంలో ఎంతో మంది నాకు అండ‌గా నిలిచారు. కెరీర్ కుదుపుల‌కు లోనైన‌ప్పుడు ఎంతో స‌హ‌క‌రించారు. ఇన్నేళ్లుగా న‌న్ను అభిమానిస్తూ.. నాపై న‌మ్మ‌కాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వ‌చ్చిన అభిమానుల‌కు ఎప్ప‌టికీ రుణ ప‌డి ఉంటాను' అని నితిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ' అనే మాస్ యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ క‌థానాయిక‌లు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. శ‌ర వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story