జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ అయ్యే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు హాజరైన నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ప్రస్తుత విధానాన్ని తప్పుబట్టారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పిన ఎగ్జిబిటర్లు, పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగైతేనే సినిమా థియేటర్ల మనుగడ కొనసాగుతుందని తెలిపారు. అందుకు సంబంధించి నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానించారు.