రెట్రో ప్రీ రిలీజ్‌లో వారిని ఉద్దేశించి కామెంట్స్..రౌడీబాయ్‌పై కేసు

ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు.

By Knakam Karthik
Published on : 22 Jun 2025 2:25 PM IST

Cinema News, Tollywood, Entertainment, Vijay Devarakonda, Tribals, Controversial comments

రెట్రో ప్రీ రిలీజ్‌లో వారిని ఉద్దేశించి కామెంట్స్..రౌడీబాయ్‌పై కేసు

ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీన రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుకల్లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్‌ కుమార్‌ రాథోడ్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్‌ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈమేరకు మాదాపూర్‌ ఏసీపీ శ్రీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయ్ ఏం మాట్లాడారు?

తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్‌ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి.

Next Story