గద్దర్ అవార్డులకు ఛైర్పర్సన్గా సీనియర్ నటి ఎంపిక
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్పర్సన్గా నటి జయసుధను ఎంపిక చేశారు
By Knakam Karthik
గద్దర్ అవార్డులకు ఛైర్పర్సన్గా సీనియర్ నటి ఎంపిక
తెలుగు మూవీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్గా నటి జయసుధను ఎంపిక చేశారు. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది.
జయసుధ, ఎఫ్డీసీ ఎండీ హరీశ్లతో సమావేశమైన ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు.ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు. 14 సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదని అన్నారు.
అవార్డుల కోసం దాఖలైన నామినేషన్లను ఈ నెల 21వ తేదీ నుంచి జ్యూరీ పరిశీలించనుంది. తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత కేటగిరీలో 1,172, ఫీచర్ ఫిల్మ్, చిల్ట్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలలో 76 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.