విషాదం.. '3 ఇడియట్స్' నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా కన్నుమూశారు. గురువారం నాడు వంట గదిలో ఏదో పని చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ మరణించారు.
By అంజి Published on 21 Sept 2023 1:43 PM IST
విషాదం.. '3 ఇడియట్స్' నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా కన్నుమూశారు. గురువారం నాడు వంట గదిలో ఏదో పని చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ మరణించారు. ఆయన వయసు 58. అమీర్ఖాన్ హీరోగా నటించిన 'త్రీ ఇడియట్స్' మూవీలో లైబ్రేరియన్ పాత్రలో అఖిల్ మిశ్రా నటించాడు. అఖిల్ మిశ్రా.. త్రీ ఇడియట్స్తో పాటు బాలీవుడ్లో 'భోపాల్: ఎ ప్రేయర్ ఫర్ రెయిన్', డాన్, గాంధీ మై ఫాదర్, శిఖర్తో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు.
''ఇది ఒక ప్రమాదం. అతను వంటగదిలో నేలపై మరణించి కనిపించాడు. ఆయన మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించారు. మేము నివేదికల కోసం ఎదురు చూస్తున్నాము'' అని అఖిల్ మిశ్రా సన్నిహితులు ఒకరు తెలిపారు. సంఘటన జరిగినప్పుడు అతని భార్య సుజానే హైదరాబాద్లో షూటింగ్లో ఉన్నారని తెలిసింది. అఖిల్ మిశ్రా, 1965లో జన్మించారు. అతను 'హజారోన్ ఖ్వైషీన్ ఐసీ', 'గాంధీ, మై ఫాదర్' వంటి చిత్రాలలో 'ప్రైమ్ మినిస్టర్' వంటి టెలివిజన్ ధారావాహికలలో పనిచేశాడు.
అతను '3 ఇడియట్స్'లో లైబ్రేరియన్ దూబే యొక్క అతిధి పాత్రను చేయడం ద్వారా, టీనా దత్తా, రష్మీ దేశాయ్ నటించిన ఉత్తరన్లో ఉమేద్ సింగ్ బుందేలా పాత్రను పోషించడం ద్వారా ప్రజాదరణ పొందాడు. అఖిల్ మొదటిగా 1983లో మంజు మిశ్రాను వివాహం చేసుకున్నాడు. 1983లో తన మొదటి చలనచిత్రం 'ధత్ తేరే...కి', 'గృహలక్ష్మి కా జిన్' అనే సీరియల్లో మంజుతో కలిసి నటించాడు. 1997లో మంజు మరణం తర్వాత, అతను ఫిబ్రవరి 2009లో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ను వివాహం చేసుకున్నాడు. 2009లో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్న వీరు 2011లో సంప్రదాయ పద్దతుల్లో మరోసారి పెళ్లి పీటలెక్కారు. అఖిల్ మిశ్రా మరణంతో బాలీవుడ్లో విషాదం ఛాయలు నెలకొన్నాయి.