దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్కౌంటర్ చేశారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్పల్లి అండర్పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆత్మరక్షణపై కాల్పులు జరిపిన పోలీసులు నిందితులను మట్టుబెట్టారు.
ఈ ఎన్కౌంటర్పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని, అంతకు మించి న్యాయం జరిగిందని భావిస్తున్నామని దిశ తల్లిదండ్రులు తెలిపారు.