బ్రేకింగ్ న్యూస్: భారీ ఎన్కౌంటర్..!
By సుభాష్ Published on 22 Feb 2020 2:57 PM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒడేకదేవాల్ అటవీ ప్రాంతంలో దాదాపు 30 గంటల పాటు ఈ కాల్పుల ఆపరేషన్ హోరాహోరీగా సాగింది. కసాల్పవాడ్ అటవీ ప్రాంతంలో ఈ భీకరమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటన ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story