కరెంట్ షాక్తో ఏనుగు మృతి
By అంజి Published on 21 Jan 2020 9:06 AM GMTచిత్తూరు జిల్లాలో కరెంట్ షాక్తో ఏనుగు మృతి చెందింది. పలమనేరు నియోజకవర్గం బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామసమీపంలో ఈ ఘటన జరిగింది. పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ల సహాయంతో అడవిలోకి మళ్లీంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోని ఓ ఏనుగు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. స్తంభం విరిగిపడడంతో కరెంట్ వైర్లు తగిలి ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.
ఇటీవల విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని నాగావళి నదితీరంలో ఊబిలో కూరుకుపోయి ఓ ఏనుగు మృతి చెందింది.
Next Story