తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 7:54 AM GMT
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు మధ్యగల ఘాట్‌రోడ్డులో ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణించినట్టు సమాచారం.

Accident 1

క్షతగాత్రులను హుటాహుటిన రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు మారేడుపల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అడవిలోని పాములేరు వద్ద బస్సు లోయలో పడినట్లు సమాచారం. Accident 3

కర్నాటక రాష్ట్రానికి చెందిన టెంపో ట్రావెలర్‌ వాహనంలో భద్రాచలం నుంచి చింతూరు మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా సరిగా లేవని అధికారులు చెబుతున్నారు.

Accident 5

సంఘటనా స్థలికి చేరుకున్న మారేడుమిల్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివరామకృష్ణ, పోలీసు బృందం సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు బస్సు ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story