హైదరాబాద్: తెలంగాణలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సులు (పీజీ ఈసెట్ ద్వారా), ఎల్ఎల్బీ కోర్సులు (లాసెట్ ద్వారా), ఎల్ఎల్ఎం మాస్టర్ కోర్సులు ( పీజీ ఎల్సెట్ ద్వారా) ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్లను అడ్మిషన్స్ కమిటీ ఖరారు చేసింది . ఈ మూడింటికీ ఇవాళ (జూలై 26, శనివారం) నోటిఫికేషన్లు జారీ చేయబడతాయి.
ఆగస్టు 1 నుండి PGECET కౌన్సెలింగ్, ఆగస్టు 4 నుండి LAWCET (UG) కౌన్సెలింగ్, ఆగస్టు 25 నుండి PGLCET కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నాయి . రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి అధ్యక్షతన అడ్మిషన్ల కమిటీ సమావేశాలు జరిగాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నుండి కళాశాలలకు అనుమతులు అందిన తర్వాత షెడ్యూల్లను ఖరారు చేశారు.
పీజీఈసెట్:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి 9 వరకు ఉంటుంది. ఆగస్టు 11 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 18 నుంచి 21 అడ్మిషన్ పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
లాసెట్:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి 14 వరకు ఉంటుంది. ఆగస్టు 16 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 22వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 22నుంచి 25 అడ్మిషన్ పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
పీజీ ఎల్సెట్:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 8వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 9 నుంచి 13 అడ్మిషన్ పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.