తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళే విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్ 3 నుంచి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు