గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ఉచిత శిక్ష‌ణ‌తో పాటు స్టైఫండ్‌

Good News for Group 1 and 2 candidates in Telangana.తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2022 9:31 AM GMT
గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ఉచిత శిక్ష‌ణ‌తో పాటు స్టైఫండ్‌

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ బుధ‌వారం శుభ‌వార్త చెప్పారు. త్వ‌ర‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు రానున్న వేళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఈ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల్లోపు ఉన్నవారు ఈరోజు నుంచి ఈనెల 16 లోపు ఆన్‌లైన్‌లో https://studycircle.cgg.gov.in, https://mjpabcwreis.cgg.gov.in లలో రిజిస్టర్ చేసుకోవాల‌ని సూచించారు.

ఈ నెల 16న ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అందులో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ఈ నెల 21 నుంచి 1.25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో 25 వేల మందికి నేరుగా మిగ‌తా ల‌క్ష మందికి హైబ్రిడ్ విధానంలో శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. 16 స్ట‌డీ స‌ర్కిళ్లు, 103 స్ట‌డీ సెంట్ల‌ర్ల ద్వారా శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధులు, ఎన్జీవోలు ముందుకొచ్చి మౌళిక వ‌స‌తులు స‌మ‌కూరిస్తే మ‌రిన్ని స్టడీ సెంట‌ర్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

అంతేకాకుండా గ్రూప్-1, గ్రూప్-2 రాసే 10 వేల మంది అభ్యర్ధులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్ధులకు 6నెలల పాటు నెలకు రూ. 5 వేలు, గ్రూప్-2 అభ్యర్ధులకు మూడు నెలల పాటు నెలకు రూ. 2వేలు, ఎస్సై అభ్యర్ధులకు నెలకు రూ.2వేలు స్టైఫండ్ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.

Next Story