మహా శివరాత్రికి ఆ పేరేలా వచ్చిందంటే?
ఈ సృష్టికి లయకారకుడైన పరమశిశుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహా శివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున ఆ ముక్కింటి శివలింగంగా ఆవిర్భవిస్తాడు.
By అంజి Published on 26 Feb 2025 7:13 AM ISTNext Story
మహా శివరాత్రికి ఆ పేరేలా వచ్చిందంటే?
ఈ సృష్టికి లయకారకుడైన పరమశిశుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహా శివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున ఆ ముక్కింటి శివలింగంగా ఆవిర్భవిస్తాడు. అయితే పురణాల ప్రకారం.. శివరాత్రికి మరో కారణం కూడా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ బయటకి వచ్చే విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో నింపుకుని ముల్లోకాలను కాపాడుతాడు. ఇలా చేసిన ఆ కాళ రాత్రే శివరాత్రి అని ప్రతీతి.
బ్రహ్మ, విష్ణువు మధ్య వివాదం..
విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తుతుంది. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, లింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ అది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. అయితే తాను ఆది కనుగొన్నట్టు మొగలిపువ్వు, గోవుతో శివుడికి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అది తెలిసి బ్రహ్మ, మొగలిపువ్వు, గోవును శివుడు శపిస్తాడు.
శివ పదమణి మాల ప్రకారం.. శ అంటే శివుడు. వ అంటే శక్తి అర్థం. శివ అంటే శుభప్రదం, మంగళకరం, శ్రేయస్కరం అనే అర్థాలు ఉన్నాయి. శివరాత్రి వేళ ఎవరైతే లింగాన్ని పూజిస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. స్పటిక లేదా వెండి లింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.