తీహార్‌ జైల్లో ఉరికి ట్రయల్స్‌

By సుభాష్  Published on  10 Jan 2020 4:05 PM GMT
తీహార్‌ జైల్లో ఉరికి ట్రయల్స్‌

దేశంలో సంచలనం సృష్టిచిన నిర్భయ కేసులో దోషుల కథ సుఖాంతం కానుంది. ఏడేళ్లు సాగిన ఈ కేసు.. ప్రధాన నిందితులైన అక్షయ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్త, ముఖేష్‌ లకు ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష వేయనున్నారు. ఈ దోషులకు మరణ శిక్ష అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది.

ఇక కామాంధులకు ఉరి తీయడమే తరువాయి. కానీ ఉరిశిక్ష వేయాలంటే ఎన్నోప్రాసెస్‌ లు ఉంటాయి. అన్ని విధివిధానాలు పూర్తిచేశాకే ఉరిశిక్ష అమలు చేస్తారు. ఇక ఈ నలుగురి దోషులను ఉరివేసేందుకు తీహార్‌ జైలు సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఒక్కో దోషి ఎంత బరువు ఉంటాడో అంత బరువున్న వస్తువులను ఉపయోగించి ఉరి ట్రయల్స్‌ వేయనున్నారు. ఈ ఉరిశిక్ష ట్రయల్స్‌ మూడో నెంబర్‌ కారాగారంలో నిర్వహించేందుకు సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రయల్స్‌ లో జైలు సూపరింటెండెంట్‌, వర్క్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు, ఇతర అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.

ఇక ఉరి తీతకు ఉపయోగించే తాళ్లను బక్సర్‌ జైలు నుంచి తెచ్చిస్తున్నారు. గతంలో అప్జల్‌ గురును జైలు నంబర్‌ 3లోనే ఉరి తీశారు. ఇప్పుడు ఈ నలుగురిని కూడా ఇదే నంబర్‌ లోనే ఉరి తీయనున్నారు. నలుగురిని ఒకే సారి ఉరితీయడం దేశంలోనే మొదటిసారి.

Next Story