బ్రేకింగ్‌: చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. ఆరేళ్ల బాలిక హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

By సుభాష్  Published on  24 Feb 2020 10:54 AM GMT
బ్రేకింగ్‌: చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. ఆరేళ్ల బాలిక హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

ఆరేళ్ల బాలిక హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాలిక హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పువెలువరించింది. గత ఏడాది నవంబర్‌ నెలలో రఫీ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం, హత్య పాల్పడ్డాడు. ఈ కేసును సీరియన్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా, ఈ కేసులో దోషిగా తేలిన మహ్మద్‌ రఫీకి ఉరిశిక్ష విధించింది. అయితే చిత్తూరు జిల్లాలో పోక్సో చట్టం కింద అమలైన తొలి ఉరిశిక్ష ఇది. కాగా, తీర్పును హైకోర్టుకు పంపుతున్నట్లు, ఉరిశిక్ష అమలు తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Next Story