Anantapurm: టమోటా మార్కెట్‌లో వైసీపీ మద్దతుదారుడు దారుణ హత్య

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాస్‌ను దుండగులు అతి క్రూరంగా హత్య చేశారు

By అంజి  Published on  29 March 2023 6:11 AM GMT
YCP supporter Srinivas, Anantapur district, Crime news

Anantapurm: టమోటా మార్కెట్‌లో వైసీపీ మద్దతుదారుడు దారుణ హత్య 

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాస్‌ను దుండగులు అతి క్రూరంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక యువకుడు వంశీ, అతని అనుచరుల దాడిలో శ్రీనివాస్ మృతి చెందినట్లు సమాచారం. వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా కక్కలపల్లిలో స్థానిక టమాటా మార్కెట్‌లో వంశీ అనే వ్యక్తితో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు శ్రీనివాస్‌కు గొడవ జరిగింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.

అనంతరం వంశీ తన అనుచరులను తీసుకొచ్చి శ్రీనివాస్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ మృతి చెందాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, శ్రీనివాస్ హత్య జరిగిన స్థలాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.

Next Story