భార్య కాళ్లు, చేతులు కట్టేసి భర్త బానిసత్వ శృంగారం.. ఆ సమయంలో ముక్కు నుండి రక్తం కారడంతో..

తమిళనాడులోని హోసూర్‌లో ఒక జిమ్ ట్రైనర్ తన భార్యను చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు.

By అంజి
Published on : 4 May 2025 6:57 AM IST

gym trainer, Tamil Nadu, Hosur, Woman tied and gagged,  Crime

భార్య కాళ్లు, చేతులు కట్టేసి భర్త బానిసత్వ శృంగారం.. ఆ సమయంలో ముక్కు నుండి రక్తం కారడంతో

తమిళనాడులోని హోసూర్‌లో ఒక జిమ్ ట్రైనర్ తన భార్యను చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు. అయితే, ఆ వ్యక్తి ఆమె శృంగార సమయంలో మరణించిందని పేర్కొన్నాడు. 34 ఏళ్ల భాస్కర్ జిమ్ ట్రైనర్.. నాలుగు జిమ్‌లను నడుపుతుండగా, అతని భార్య శశికళ మహిళలకు మాత్రమే జిమ్ నడుపుతోంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత 2018లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో శశికళ బెంగళూరులో ప్లేయింగ్ స్కూల్ నడిపేవారు. భాస్కర్ చెప్పిన దాని ప్రకారం, ఏప్రిల్ 30న, ఆ జంట శృంగారం చేస్తున్నప్పుడు అతని భార్య ముక్కు నుండి రక్తం కారింది.

అందుకే అతను ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాడు, అక్కడ ఆమె మరణించిందని ప్రకటించారు. విచారణలో భాస్కర్ పోలీసులకు చెప్పినట్లుగా.. తాను, శశికళ బంధన లైంగిక చర్యకు ముందు మద్యం సేవించామని తెలిసింది. ఆ సమయంలో అతను ఆమె చేతులు, కాళ్ళను కట్టివేసి, ఆమె మెడకు గుడ్డ చుట్టి.. శృంగారం చేశాడు. ఆమె ముక్కు నుండి రక్తం రావడం చూసి, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లానని అతను చెప్పాడు. శశికళ తండ్రి అరుళ్, బంధువులు భాస్కర్ వాదనలను ఖండించారు. భాస్కర్ శశికళపై శారీరకంగా దాడి చేసేవాడని, ఆమెతో నిరంతరం గొడవ పడుతున్నాడని చెప్పారు.

భాస్కర్ రూ.14 లక్షల కట్నం తీసుకున్నాడని, ఆమెతో నిరంతరం గొడవ పడ్డాడని అరుళ్ పేర్కొన్నాడు. శశికళ తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిందని, దీని వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ఆరోపించారు. "అతను ఆమెను కొట్టేవాడు. మేము ఆమెను రెండుసార్లు ఆసుపత్రిలో చేర్చాము. పోలీసులకు ఫిర్యాదు చేసాము. ఈసారి అతను తమాషా చేస్తున్నాడని నేను అనుకున్నాను" అని అతను చెప్పాడు. "అతను ఆమె గొంతును బిగించి, ఆమె చేతులు, కాళ్ళను కట్టివేసి, ఆమెను చంపాడు. నా కుమార్తె చనిపోయిందని ఆసుపత్రి నుండి నాకు ఫోన్ చేశాడు" అని అరుల్ చెప్పాడు. ఆ దంపతులకు రెండు, నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story