ప్రాణాలు తెగించి చిరుతతో పోరాడి.. వదినను రక్షించిన మరిది

Woman, Brother-In-Law Critically Injured In Leopard Attack In Odisha. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చిరుతపులి దాడి చేయడంతో ఒకే కుటుంబానికి మహిళ, ఆమె మరిది

By అంజి  Published on  17 March 2022 3:58 AM GMT
ప్రాణాలు తెగించి చిరుతతో పోరాడి.. వదినను రక్షించిన మరిది

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చిరుతపులి దాడి చేయడంతో ఒకే కుటుంబానికి మహిళ, ఆమె మరిది తీవ్రంగా గాయపడ్డారని అటవీ అధికారి తెలిపారు. రిపోర్టు ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు అటవీ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న తరానా గ్రామానికి చెందిన మొయినా హన్స్దా మలవిసర్జన కోసం తన ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు చీకటిలో దాగి ఉన్న చిరుతపులి దాడి చేసింది. సహాయం కోసం మొయినా కేకలు వేసింది. కేకలు విన్న ఆమె బావ దశరథ్ హన్స్డా చిరుతపులి నుండి ఆమెను రక్షించడానికి పరుగెత్తాడు.

మొయినను పక్కనపెట్టి చిరుతపులి దశరథ్‌పై దాడి చేసింది. సహాయం కోసం వారి కేకలు విన్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను సమీపంలోని అడవికి తరిమికొట్టారు. తీవ్ర రక్తస్రావమై ఉన్న మొయిన, దశరథ్‌లను 108 అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఇక్కడి సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. చిరుతపులి దశరథ్ అరచేతిని నమిలింది. మొయిన చేతిని కొరికింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు అటవీ శాఖ బృందం తరానా గ్రామాన్ని సందర్శించింది.

Next Story