Adilabad: భార్య విడిచి వెళ్లడం తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య

భార్య నుంచి విడిపోవడం తట్టుకోలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇందర్‌వెల్లి మండలంలో చోటుచేసుకుంది.

By అంజి
Published on : 10 Jun 2024 7:23 AM IST

Adilabad, Crime news, suicide

Adilabad: భార్య విడిచి వెళ్లడం తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : భార్య నుంచి విడిపోవడం తట్టుకోలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సాయంత్రం ఇందర్‌వెల్లి మండలం సత్వాజిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. జైనూర్‌ మండలం పఠాన్‌పూర్‌ గ్రామానికి చెందిన నాగర్‌జోలె నాగనాథ్‌(40) పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఇందర్‌వెల్లి పోలీసులు తెలిపారు. భార్య పార్వతి తన వద్ద ఉండకపోవడంతో నాగనాథ్‌ మనస్తాపానికి గురయ్యాడు. నిత్యం మద్యం మత్తులో ఆమెతో గొడవ పడి పార్వతి అతడిని విడిచిపెట్టింది. ఏడేళ్లుగా నాగనాథ్ తనతో గొడవ పడుతున్నాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు.. కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం మామిడిపల్లికి చెందిన నాగర్‌గోజే నాగ్‌నాథ్‌(35)కు సత్వాజిగూడకు చెందిన పార్వతితో 8 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా పార్వతి కొన్ని రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. నాగ్‌నాథ్‌ ఆదివారం సత్వాజీగూడకు వచ్చాడు. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది అత్తగారి వ్యవసాయ చేనులో గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story