కిడ్నాపర్‌ అనే అనుమానంతో.. ట్రాన్స్‌జెండర్‌ని వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి దాడి

కిడ్నాపర్ అనే అనుమానంతో చెన్నైలో ఒక లింగమార్పిడి వ్యక్తిని ఒక గుంపు కరెంట్‌ స్తంభానికి కట్టి, బట్టలు విప్పి, దారుణంగా కొట్టింది.

By అంజి  Published on  21 Feb 2024 4:37 AM GMT
Trans person, Chennai, kidnapper, Crime

కిడ్నాపర్‌ అనే అనుమానంతో.. ట్రాన్స్‌జెండర్‌ని వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి దాడి

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. కిడ్నాపర్ అనే అనుమానంతో చెన్నైలో ఒక లింగమార్పిడి వ్యక్తిని ఒక గుంపు కరెంట్‌ స్తంభానికి కట్టి, బట్టలు విప్పి, దారుణంగా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పమ్మల్‌కు చెందిన ధన అనే 25 ఏళ్ల వ్యక్తి ఐటీ కంపెనీలో ఉద్యోగి. సోమవారం రాత్రి నగరంలోని పల్లావరం సమీపంలోని ఓ తినుబండారంలో భోజనం చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ ప్రాంతంలో కిడ్నాప్‌ జరిగిందనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో నివాసితులు ఉలిక్కిపడ్డారు. గుంపు ధనను గుర్తించినప్పుడు, వారు కిడ్నాపర్‌గా అనుమానించారు. ధనను మొదట కరెంట్‌ స్తంభానికి కట్టి, ఆపై సగం వివస్త్రను చేశారు. తప్పుడు వ్యక్తిని పట్టుకున్నారని చెబుతూ వచ్చిన ట్రాన్స్‌జెండర్‌ను ఆ గుంపు వేధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధనను రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ధనా ఏడుస్తూ కనిపించింది. పోలీసులు వీడియో తీస్తున్న వారిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు.

Next Story