Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌

రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

By అంజి
Published on : 18 July 2025 9:08 AM IST

Three killed, car-truck collision, Adibatla, Outer Ring Road, Hyderabad

Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌ లోని పిల్లర్ నంబర్ 108 సమీపంలో ఈ సంఘటన జరిగింది. పెద్ద అంబర్‌పేట్ నుండి బొంగుళూరుకు నలుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా, డ్రైవర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు.

కారు ఢీకొన్న ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, నాల్గవ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను మలోత్ చందు లాల్(29), గగులోత్ జనార్దన్(50), కావలిబాలరాజు(40) గా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story