17 ఏళ్ల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. కిడ్నాప్‌ చేసి..

తమిళనాడులోని వెల్లకోవిల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

By అంజి  Published on  13 March 2024 1:13 AM GMT
religious yatra, Tamil Nadu, Crime news,  Vellakovil

17 ఏళ్ల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. కిడ్నాప్‌ చేసి.. 

తమిళనాడులోని వెల్లకోవిల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏడుగురు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 9న, వీరకుమారస్వామి ఆలయ రథోత్సవానికి హాజరయ్యేందుకు బాలిక గ్రామంలోకి వెళ్లింది.

ఈ క్రమంలోనే నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు. ఆపై లైంగికంగా దాడి చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కామరాజపూర్‌కమ్‌కు చెందిన 32 ఏళ్ల నిందితుడిని, ఇతర 29 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశాయి. అనంతరం మిగిలిన వారిని అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story