ఫేస్‌బుక్ లైవ్‌లో కాల్పులు.. శివసేన నాయకుడు మృతి.. నిందితుడు ఆత్మహత్య

ముంబైలోని దహిసర్ ప్రాంతంలో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్న శివసేన (యూబీటీ) నేతపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత అతడు తుపాకీ గాయాలతో చనిపోయాడు.

By అంజి  Published on  9 Feb 2024 1:30 AM GMT
Team Uddhav leader, Facebook live, Abhishek Ghosalkar,Mauris Noronha,Crime news

ఫేస్‌బుక్ లైవ్‌లో కాల్పులు.. శివసేన నాయకుడు మృతి.. నిందితుడు ఆత్మహత్య

గురువారం ముంబైలోని దహిసర్ ప్రాంతంలో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్న శివసేన (యూబీటీ) నేతపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత అతడు తుపాకీ గాయాలతో చనిపోయాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శివసేన (యుబిటి) నాయకుడు వినోద్ ఘోసల్కర్ కుమారుడు, మాజీ కార్పొరేటర్ అయిన అభిషేక్ ఘోసల్కర్, మారిస్ భాయ్ అని కూడా పిలువబడే మారిస్ నోరోన్హాతో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మౌరిస్ నోరోన్హా లైవ్ స్ట్రీమ్ నుండి నిష్క్రమించాడు. తర్వాత ఘోసల్కర్‌పై మూడుసార్లు కాల్చాడు. దీని తర్వాత మారిస్ భాయ్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. మౌరిస్ నోరోన్హా బోరివలి వెస్ట్ నివాసి అని, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్షను కలిగి ఉన్న సామాజిక కార్యకర్త అని పేర్కొన్నారు. అతను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాజకీయ నాయకులతో అనేక చిత్రాలను పంచుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అభిషేక్ ఘోసల్కర్, మారిస్ నొరోన్హా కార్యాలయాలు ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి. స్థానిక రాజకీయాలపై ఆధిపత్యం కోసం వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు మీడియాకు తెలిపారు.

ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ శిండే విచారణకు ఆదేశించగా, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ సంజయ్‌ రౌత్‌ డిమాండ్ చేశారు.

ఇటీవల, మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్‌ను హిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ పోలీసు క్యాబిన్‌లో బిజెపి ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపాడు. సుదీర్ఘకాలంగా ఉన్న భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు గుమిగూడారు. ఈ ఘటనలో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా గాయపడ్డారు.

Next Story