పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి.. వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి చేసినందుకు 30 ఏళ్ల వ్యక్తి శుక్రవారం నాడు ఒక వృద్ధుడిని కొట్టి చంపాడని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపారు.

By -  అంజి
Published on : 5 Dec 2025 3:45 PM IST

not getting married, UP man kills businessman, morning walk, Crime

పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి.. వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి చేసినందుకు 30 ఏళ్ల వ్యక్తి శుక్రవారం నాడు ఒక వృద్ధుడిని కొట్టి చంపాడని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిని బ్రిజేష్ యాదవ్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు. సర్కిల్ ఆఫీసర్ (సకల్దిహా) స్నేహ తివారీ మాట్లాడుతూ, సకల్దిహా ప్రాంతంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, తులసి ఆశ్రమ ప్రాంతంలో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త ఉమాశంకర్ మౌర్య (62) తన సాధారణ ఉదయం నడక కోసం ఇంటి నుండి బయలుదేరాడని చెప్పారు. అమ్దారా-సకల్దిహా రోడ్డులో స్టేషన్ ముందుకు చేరుకోగానే, అదే గ్రామానికి చెందిన యాదవ్ అనే వ్యక్తి అతనిపై కర్రలతో దాడి చేశాడని, అతను తీవ్రంగా గాయపడ్డాడని ఆమె చెప్పారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తరలించేలోపే అతడు గాయాలతో మరణించాడని అధికారి తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసినట్లు తివారీ తెలిపారు. విచారణ సమయంలో, తాను మౌర్యను ద్వేషంతోనే చంపానని యాదవ్ చెప్పాడని, పెళ్లి ఎప్పుడు అంటూ బాధితుడు తనను ఎగతాళి చేశాడని చెప్పాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story