పెట్రోల్ బంక్ వద్ద గొడవ.. ఆపడానికి పోతే కొట్టి చంపారు

Tamil Nadu man killed for trying to stop fight at petrol bunk. తమిళనాడులోని తిరునెల్వేలిలో పెట్రోల్ బంక్ వద్ద గొడవను ఆపడానికి ప్రయత్నించినందుకు 33 ఏళ్ల వ్యక్తిని దారుణంగా

By అంజి  Published on  9 March 2022 4:25 AM GMT
పెట్రోల్ బంక్ వద్ద గొడవ.. ఆపడానికి పోతే కొట్టి చంపారు

తమిళనాడులోని తిరునెల్వేలిలో పెట్రోల్ బంక్ వద్ద గొడవను ఆపడానికి ప్రయత్నించినందుకు 33 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. హత్యకేసులో ప్రమేయమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సోమవారం మార్చి 7న తిరునల్వేలి జిల్లాలోని పనగుడి పట్టణానికి చెందిన కళైచెల్వన్ అనే వ్యక్తి పెట్రోల్ బంక్‌కు వెళ్లగా అక్కడ సిబ్బందిపై ముఠా దాడి చేయడం చూశాడు. ఆటో కుమార్, బాలసుబ్రమణ్యం, శివరామన్, మణిసరాజు అనే నిందితులు బంక్‌లోని పంపులో రిగ్గింగ్‌ జరిగిందని పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

వాదన ముష్టియుద్ధంగా మారింది. ఇది గమనించిన కళైచెల్వన్ వారి గొడవను ఆపడానికి, వ్యక్తులను వేరు చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ముఠా అతని వైపు దృష్టి మరల్చి చుట్టుముట్టి దారుణంగా కొట్టడం మొదలుపెట్టింది. పెట్రోలు బంక్ సిబ్బంది స్పందించి కళైచెల్వన్‌ను రక్షించే సమయానికి అతడిని దారుణంగా కొట్టారు. కళైచెల్వన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న వల్లీయూరు పోలీసులు బాలసుబ్రమణ్యం, ఆటో కుమార్, శివరామన్‌లను అరెస్టు చేసి మనీస్‌రాజు కోసం గాలిస్తున్నారు. కళైచెల్వన్‌ను కొట్టి చంపిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ ఫుటేజీని కూడా భద్రపరిచారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.

Next Story