ఇబ్రహీంపట్నంలో దారుణం.. బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థిని భార్గవి(19) తీవ్రగాయాలతో మృతి చెందింది.

By అంజి  Published on  19 March 2024 6:38 AM GMT
B Tech student , Ibrahimpatnam, Crime news

ఇబ్రహీంపట్నంలో దారుణం.. బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణం జరిగింది. బీటెక్‌ చదువుతున్న విద్యార్థిని భార్గవి (19) తీవ్రగాయాలతో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భార్గవి మరణాన్ని పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె తల్లే భార్గవిని హతమార్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలోని దండుమైలారంలో జంగమ్మ అనే మహిళకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు భార్గవి బీటెక్‌ చదువుతోంది. భార్గవి.. శశి అనే అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఈ విషయం కాస్త జంగమ్మకు తెలిసింది.

ఈ ప్రేమ వ్యవహారం తెలవడంతో గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే నిన్న శశి, భార్గవి ఇంటికి వచ్చి వెళ్ళాడు. శశి రావడం చూసిన జంగమ్మ ఆవేశానికి లోనై కూతుర్ని కోపడ్డింది. దీంతో తల్లి, కూతుర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అరిచి గోల చేసింది. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే తన అక్క భార్గవి, శశి అనే అబ్బాయిని ప్రేమించిందని, శశి ఇంటికి వచ్చి వెళ్లిన అనంతరం తల్లి జంగమ్మ ఆగ్రహానికి లోనై... వద్దన్నా కూడా శశినే ప్రేమి స్తుండడంతో భార్గవిని చీరతో ఉరివేసినట్లుగా భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.

Next Story