పరీక్ష రాయనీయలేదని విద్యార్థి ఆత్మహత్య.. ఫీజు చెల్లించకపోవడంతో..
ఫీజు చెల్లించకపోవడంతో పరీక్ష రాయకుండా నిషేధించబడినందుకు ఒక ఫార్మా విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి
పరీక్ష రాయనియలేదని విద్యార్థి ఆత్మహత్య.. ఫీజు చెల్లించకపోవడంతో..
ఫీజు చెల్లించకపోవడంతో పరీక్ష రాయకుండా నిషేధించబడినందుకు ఒక ఫార్మా విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం తనను పరీక్షకు హాజరుకాకుండా అడ్డుకుందని, దీని వల్ల అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, ఫలితంగా అతను మరణించాడని విద్యార్థి కుటుంబం ఆరోపిస్తోంది.
బాధితుడు సమర్పణ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుతున్నాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల విద్యార్థులలో ఆగ్రహం పెల్లుబికింది. కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గది నుండి విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. విద్యార్థి సోదరుడు అమిత్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా కళాశాల యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాధితుడి కుటుంబం రాయ్బరేలి జిల్లాకు చెందినది.
ఫిర్యాదు ప్రకారం.. చిన్హాట్ పోలీస్ స్టేషన్లో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 108, 352 , షెడ్యూల్డ్ కులాల చట్టంలోని సెక్షన్ 3(2) కింద కేసు నమోదు చేయబడింది. ఎఫ్ఐఆర్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ్ కుమార్ వర్మ, క్లాస్ టీచర్ గరిమా సింగ్, డీన్ దీప్తి శుక్లా, క్యాషియర్ మహ్మద్ ఫైజ్, ఆశిష్లను నిందితులుగా పేర్కొన్నారు. పోస్టుమార్టం తర్వాత, విద్యార్థి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు మృతదేహాన్ని రాయ్బరేలికి తిరిగి తీసుకెళ్లారు.