శ్రీకాకుళం : 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇద్దరు యువకులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Srikakulam Two youth gets 20 years rigorous imprisonment.శ్రీకాకుళంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jan 2023 3:39 AM GMT
శ్రీకాకుళం : 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇద్దరు యువకులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

శ్రీకాకుళంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులకు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో లుట్టా అనిల్ కుమార్ (26), పామోటి రవి (20)లకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. బాధితురాలికి మూడు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

2020 డిసెంబర్‌లో బాలిక శ్రీకాకుళం జిల్లాలోని నిందితుడు అనిల్‌కుమార్‌ ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనిల్ కుమార్ ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమెను బెదిరించి మూడు నాలుగు సార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక‌ గర్భవతి అయింది.

జూన్ 2021లో బాలిక గ్రామంలో కట్టెలు సేకరిస్తున్నప్పుడు బాధితురాలిపై పామోటి రవి అత్యాచారం చేశాడు. బాలికను ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు ఆమె పిండాన్ని తొలగించి పోలీసులకు సమాచారం అందించారు.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఎంఏ అహ్మద్‌ నేతృత్వంలో జి సిగడాం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దిశ పోలీస్‌స్టేషన్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎస్‌ వాసుదేవ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం-2012 కింద సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పోలీసులు విచారణ పూర్తి చేసి నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. సాధారణ విచారణల అనంతరం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి వెంకట రమణ మూర్తి నిందితుడి నేరాన్ని రుజువు చేశారు.

Next Story