అనుమానం రాకుండా.. ప్రియుడి నెంబ‌ర్‌నే అలా సేవ్ చేసుకుంది..!

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో వ్యక్తి ఉన్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.

By Medi Samrat
Published on : 19 Jun 2025 3:38 PM IST

అనుమానం రాకుండా.. ప్రియుడి నెంబ‌ర్‌నే అలా సేవ్ చేసుకుంది..!

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో వ్యక్తి ఉన్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. సోనమ్ కాల్ డేటాలో "సంజయ్ వర్మ" అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినట్లు తేలింది. అయితే ఆ సంజయ్ వర్మ మరెవరో కాదని, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని నిర్ధారించారు. ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే రాజ్ కుశ్వాహా మొబైల్ నంబర్‌ను సంజయ్ వర్మ పేరుతో సోనమ్ సేవ్ చేసుకుందని పోలీసులు తెలిపారు.

రాజా రఘువంశీతో వివాహానికి ముందు, ఆ తర్వాత కూడా 39 రోజుల వ్యవధిలో 234 సార్లు ఫోన్ మాట్లాడుకున్నట్లు తేలింది. రాజా హత్యకు సోనమ్ ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇండోర్‌కు చెందిన రాజా, సోనమ్‌లకు మే 11న వివాహం జరిగింది. సోనమ్, తన కుటుంబ ఫర్నిచర్ యూనిట్ అకౌంటెంట్ రాజ్‌తో అప్పటికే రిలేషన్ షిప్ కొనసాగిస్తోందని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఈ జంట, మే 23న నాంగ్రియాట్ గ్రామంలోని హోంస్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభించింది. సోనమ్ జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమై నందగంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది.

Next Story