హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసు.. రిలేష‌న్‌షిప్‌లో ఉన్నట్లు అంగీకరించిన సోనమ్, ఆమె ప్రియుడు

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసులో.. సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు తాము రిలేషన్‌షిప్‌లో ఉన్న‌ట్లు అంగీకరించారని మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు.

By Medi Samrat
Published on : 25 Jun 2025 9:15 AM IST

హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసు.. రిలేష‌న్‌షిప్‌లో ఉన్నట్లు అంగీకరించిన సోనమ్, ఆమె ప్రియుడు

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసులో.. సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు తాము రిలేషన్‌షిప్‌లో ఉన్న‌ట్లు అంగీకరించారని మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు. రాజ్‌తో కలిసి సోనమ్ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ఈ షాకింగ్ హనీమూన్ హత్యపై మేఘాలయ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. బాధితురాలి కుటుంబం చేసిన నార్కో టెస్టు డిమాండ్‌ను పోలీసులు తిరస్కరించారు. అవసరమైన అన్ని ఆధారాలు తమ‌ వద్ద ఉన్నాయని చెప్పారు. నార్కో-విశ్లేషణ ఫలితాలు కోర్టులో అనుమతించబడవని పేర్కొన్నారు.

ఈస్ట్‌ ఖాసీ హిల్స్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ వివేక్‌ సిమ్‌ మాట్లాడుతూ.. విచారణలో రాజ్‌, సోనమ్‌ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు అంగీకరించారు. అతను ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. క్రైమ్ సీన్‌ని క్రైమ్ సీన్‌లో రీక్రియేట్ చేశాం. అతడు మాకు ప్రతిదీ చూపించాడు. మా దగ్గర ఆధారాలున్నాయి. ఈ దశలో మనం నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయడం అవ‌స‌రం లేదు అని పేర్కొన్నాడు. 'సాధారణంగా సాక్ష్యాధారాలు లేనప్పుడు నార్కో పరీక్షలు జరుగుతాయి. వాస్తవానికి నార్కో విశ్లేషణను సుప్రీంకోర్టు నిషేధించింది' అని ఆయన చెప్పారు.

కేవలం నేరాంగీకారాలపై ఆధారపడకుండా బలమైన, ఆమోదయోగ్యమైన సాక్ష్యాలను రూపొందించడంపై దృష్టి సారించి కేసును జాగ్రత్తగా పరిష్కరిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. చట్టబద్ధంగా సుస్థిరమైన ఛార్జ్ షీట్‌ను వీలైనంత త్వరగా సిద్ధం చేయడం దీని లక్ష్యం. అయితే హత్యకు డబ్బు ఒక్కటే కారణమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వారి రిలేష‌న్ షిప్‌, వృత్తిపరమైన ఆంక్ష‌లు కొనసాగడానికి నిందితులు రాజాను అడ్డు తొలగించాలనుకున్నారని అధికారి అనుమానించారు.

ఇదిలావుంటే.. మేఘాలయ పోలీసులు ఇప్పుడు ఇండోర్‌లోని ఓ ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అరెస్టు కావడానికి ముందు కొంతకాలం ఫ్లాట్‌లో ఉంది.

సోనమ్ వదిలిపెట్టిన బ్యాగ్ ఎందుకు తీసుకెళ్లిందనే దానిపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. బ్యాగ్‌లో కంట్రీ మేడ్ పిస్టల్, ఆమె ఫోన్, రాజా నగలు, రూ.5 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ఈ ప్రయత్నమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు.

ప్రాపర్టీ డీలర్ సిలోయం జేమ్స్, సెక్యూరిటీ గార్డు బల్వీర్, సోనమ్ దాక్కున్న అపార్ట్‌మెంట్ యజమాని లోకేంద్ర తోమర్‌లను గురువారం షిల్లాంగ్ కోర్టులో హాజరుపరచనున్నారు. సిలోయం జేమ్స్, బల్వీర్‌లను కూడా విచారణ నిమిత్తం షిల్లాంగ్‌కు తీసుకురానున్నారు.

Next Story