అయోధ్యలో దారుణం.. 7 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Sexual assault on a seven-year-old girl in Ayodhya. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయోధ్యలోని హనుమాన్‌గర్హికి

By అంజి  Published on  17 March 2022 6:11 AM GMT
అయోధ్యలో దారుణం.. 7 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయోధ్యలోని హనుమాన్‌గర్హికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఖాకీ అఖారా సమీపంలో రక్తపు మడుగులో బాలిక ఏడుస్తూ కనిపించింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో లక్నోకు తరలించారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయోధ్యలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రకారం.. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. అక్కడికి కొద్ది దూరంలో దిగంబర్ అఖారాకు వెళ్లే దారిలో బాలిక ఇల్లు ఉంది. బాలిక ఇంటికి కొంత దూరంలో బుధవారం భండారా నిర్వహించారు. నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు.

అదే సమయంలో నిందితులు బాలికను సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిగింది. రక్తపు మడుగులో ఉన్న బాలికను అక్కడే వదిలి నిందితులు పారిపోయారు. బాలిక ఎలాగోలా మెల్ల మెల్లగా రోడ్డుపైకి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న బాలికను చూసిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు బాలికతో క్రూరంగా హద్దులు దాటారు. రక్తం కారుతున్న చిన్నారిని మొదట శ్రీరామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను అక్కడి నుంచి జిల్లా మహిళా ఆసుపత్రికి రెఫర్ చేయగా, చిన్నారి పరిస్థితి చూసి ఇక్కడి నుంచి లక్నోకు కూడా రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story