యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటో-బ‌స్సు ఢీ.. న‌లుగురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం

Road Accident in Yadadri Bhuvanagiri District four women dead.యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 10:31 AM GMT
యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటో-బ‌స్సు ఢీ.. న‌లుగురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆటో- బ‌స్సు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 8 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న చౌటుప్ప‌ల్ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది.

దండుమ‌ల్కాపురం పారిశ్రామిక పార్కులో దేవ‌ల‌మ్మ నాగారం నుంచి వ‌స్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ నుంచి వెలుతున్న బ‌స్సు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్ర‌యాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో న‌లుగురు మ‌హిళ‌ల ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా ఉండ‌డంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

చికిత్స పొందుతూ న‌లుగురు.. నాగ‌ల‌క్మీ(28), అన‌సూయ‌(55), ధ‌న‌ల‌క్ష్మీ(35), శిరీష‌(30) లు మృతి చెందారు. వీరంతా ఓ ప‌చ్చ‌ళ్ల ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story