మ‌హ‌బూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

Road accident in Mahabubabad.మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2021 7:14 AM GMT
Road accident in Mahabubabad

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. గూడూరు మండ‌లం మ‌ర్రిమిట్ట వ‌ద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్ర‌యాణీస్తున్న ఆరుగురు ప్ర‌యాణీకులు సంఘ‌ట‌నాస్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలిస్తున్నారు. లారీ అతివేగంతో రావ‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు.

మృతుంతా ఒకే కుటుంబానికి చెందిన వార‌ని.. వీరంతా ఓ వివాహ‌వేడుకకు హాజ‌ర‌య్యేందుకు వెలుతున్నార‌ని స‌మాచారం. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. ప్రమాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.




Next Story