Narayankhed: మామిడిపండ్ల కోసం వెళ్లి.. చెరువులో శవమై కనిపించిన స్కూల్‌ విద్యార్థి

సంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల నుంచి అదృశ్యమైన 9వ

By అంజి
Published on : 16 April 2023 1:00 PM IST

Narayankhed, Residential school student , Crime news

మామిడిపండ్ల కోసం వెళ్లి.. చెరువులో శవమై కనిపించిన స్కూల్‌ విద్యార్థి

సంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల నుంచి అదృశ్యమైన 9వ తరగతి విద్యార్థి ఆదివారం ఉదయం నారాయణఖేడ్ సమీపంలోని రామసముద్రం చెరువులో శవమై కనిపించాడు. మృతుడు వై మహేష్ (16)). మహేశ్ శుక్రవారం సాయంత్రం తన ముగ్గురు స్నేహితులతో కలిసి సమీపంలోని తోటలో మామిడికాయలు తెచ్చుకునేందుకు రెసిడెన్షియల్ స్కూల్ భవనం సరిహద్దు గోడపై నుంచి దూకినట్లు సమాచారం. అయితే, మిగిలిన ముగ్గురు స్నేహితులు తిరిగి వచ్చినప్పటికీ అతను హాస్టల్‌కు తిరిగి రాలేదు.

సమాచారం అందుకున్న తల్లిదండ్రులు శనివారం హాస్టల్‌కు చేరుకుని నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని స్నేహితులతో మాట్లాడిన తరువాత, పోలీసులు ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా రామసముద్రం చెరువులో మహేష్ మృతదేహం లభించింది. చెరువులో అనుమానాస్పద స్థితిలో మహేష్‌ మృతదేహం లభ్యం కావడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొడుకు మహేష్‌ మృతికి కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story