నలుగురిని చంపి.. శవాలను బావిలో పడేసిన బాలుడు.. మ్యూజిక్‌ సౌండ్‌ పెద్దగా పెట్టి మరీ..

Odisha Boy Arrested In Tripura For Murdering 3 Of Family And A Neighbour. త్రిపురలోని ధలై జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు కుటుంబ

By అంజి  Published on  6 Nov 2022 10:30 AM GMT
నలుగురిని చంపి.. శవాలను బావిలో పడేసిన బాలుడు.. మ్యూజిక్‌ సౌండ్‌ పెద్దగా పెట్టి మరీ..

త్రిపురలోని ధలై జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు కుటుంబ సభ్యులను, ఒక పొరుగింటి వ్యక్తిని 16 ఏళ్ల బాలుడు కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత వారి మృతదేహాలను బావిలో పడవేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఆదివారం తెలిపారు.నిందితుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. "కమల్‌పూర్ సబ్‌డివిజన్‌లో నివసించే బాలుడు నిత్యం డ్రగ్స్ సేవించేవాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శనివారం ఉదయం తన తండ్రి లేని సమయంలో అతను తన తల్లి, తాత, 10 ఏళ్ల సోదరి, పొరుగింటి వ్యక్తిని హత్య చేశాడు. నేరం చేయడానికి గల కారణం తెలియరాలేదు. విచారణ జరుగుతోంది'' అని అధికారి చెప్పారు.

అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తండ్రి ఇంటికి వచ్చి చూసే సరికి.. ఎక్కడ చూసినా రక్తం చిమ్మి ఉంది. మృతదేహాలను బాలుడు ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేశారు. తండ్రి అప్రమత్తం కావడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించాడు. నిందితుడి ఇంటి వద్ద ఉదయం 9.30 గంటలకు బిగ్గరగా సంగీతం వినిపించిందని, కొన్ని గంటల తర్వాత అతని తండ్రి బావిలో నాలుగు మృతదేహాలను కనుగొన్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. "ఇతర గ్రామస్తులకు తెలియకుండా ఉంచడానికి అతను బిగ్గరగా మ్యూజిక్‌ పెట్టినట్లు మేము అనుమానిస్తున్నాము" అని పోలీసు అధికారి తెలిపారు.

శనివారం సాయంత్రం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు. నలుగురిని హత్య చేయడానికి హంతకుడు మొద్దుబారిన వస్తువును ఉపయోగించినట్లు సూచించే గాయాల గుర్తులు మృతదేహాలపై ఉన్నాయి. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే మరణానికి అసలు కారణం తెలుస్తుందని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story