కొడుకు పెళ్లిపై కోపం.. కోడలిని అత్త ఏం చేసిందంటే?

నోయిడాలోని ఓ మహిళ తన కుమారుడి పెళ్లిపై అసంతృప్తిగా ఉన్న కారణంగా తన కోడలును చంపేందుకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుంది.

By అంజి  Published on  12 Sep 2023 1:07 AM GMT
Noida woman, daughter in law, marriage, Crime news

కొడుకు పెళ్లిపై కోపం.. కోడలిని అత్త ఏం చేసిందంటే?

నోయిడాలోని ఓ మహిళ తన కుమారుడి పెళ్లిపై అసంతృప్తిగా ఉన్న కారణంగా తన కోడలును చంపేందుకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని రూ.లక్ష చెల్లించింది. ఈ కేసులో బాధితురాలి అత్త, ఇద్దరు కాంట్రాక్ట్ హంతకులతోపాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పోయిన వారం ప్రారంభంలో సెప్టెంబర్ 5 న జరిగింది, ఇద్దరు వ్యక్తులు 27 ఏళ్ల మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెను కాల్చి చంపారు. సోని అనే బాధితురాలు బీహార్‌కు చెందినది. నోయిడాలోని బాదల్‌పూర్ ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమె తన మొదటి భర్తను విడిచిపెట్టి రెండవ వివాహం చేసుకుంది. అయితే ఆమె రెండవ వివాహం కుటుంబంలో ఉద్రిక్తతకు దారితీసింది.

సోని అత్తగారు గీతా దేవి వివాహం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. తన కొడుకు రెండో పెళ్లి తర్వాత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆర్థిక సహాయం కూడా నిలిపివేసినట్లు పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించి, కోడలును చంపేందుకు వారికి లక్ష రూపాయలు చెల్లించింది. దర్యాప్తులో.. సోనీ నివాసం సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ఇద్దరు దుండగుల చిత్రాలను పోలీసులు చూశారు. ఆ తర్వాత వారిని ట్రాక్ చేశారు. అనుమానితుల్లో ఒకరైన సచిన్ పోలీసుల పిస్టల్‌తో పారిపోయేందుకు ప్రయత్నించాడని, పోలీసులతో జరిగిన గొడవలో గాయపడ్డాడని సీనియర్ పోలీసు అధికారి సునీతి సింగ్ తెలిపారు.

Next Story