జంక్ ఫుడ్ తినొద్దన్న తండ్రి.. ఉరేసుకున్న కాలేజీ విద్యార్థిని

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని జంక్ ఫుడ్ తిన్నందుకు తన తండ్రి మందలించడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on  20 March 2024 1:12 AM GMT
Nagpur, college student, junk food, Crime news

జంక్ ఫుడ్ తినొద్దన్న తండ్రి.. ఉరేసుకున్న కాలేజీ విద్యార్థిని 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో 19 ఏళ్ల విద్యార్థిని జంక్ ఫుడ్ తిన్నందుకు తన తండ్రి మందలించడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. జంక్‌ ఫుడ్‌ తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండటంతో తండ్రి మందలించారు. మృతురాలు భూమిక వినోద్ ధన్వానీ నగరంలోని సింధీ కాలనీలో నివాసముంటుందని వారు తెలిపారు.

"భూమిక బీబీఏ విద్యార్థిని, థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. జంక్ ఫుడ్ తిన్నందుకు తండ్రి ఆమెను తిట్టడంతో కలత చెంది, ఆమె పొడవాటి గుడ్డతో వంటగదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది" అని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. "ఆమె కుటుంబ సభ్యులు ఈ ఉదయం ఆమె ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు, ఆ తర్వాత ఆమెను ప్రభుత్వ వైద్య కళాశాల అండ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె చనిపోయినట్లు ప్రకటించబడింది." ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story