సంగారెడ్డి జిల్లాలో దారుణం

Murder In Sangareddy. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బొల్లారం రింగ్ రోడ్డు స‌మీపాన గ‌ల‌ సర్వీసు రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య జ‌రిగింది.

By Medi Samrat
Published on : 8 Feb 2021 9:27 AM IST

Murder In Sangareddy

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బొల్లారం రింగ్ రోడ్డు స‌మీపాన గ‌ల‌ సర్వీసు రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య జ‌రిగింది. దుండగులు వ్య‌క్తిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గుర్తుపట్ట వీలులేకుండా పెట్రోల్ పోసి తగల బెట్టారు. దుండగులు వ్య‌క్తిని ఎక్కడో హత్య చేసి బొల్లారంలో పడేసి తగల బెట్టిన‌ట్లు అనుమానిస్తున్నారు.

దుండగులు హత్యగావించ బడ్డ వ్యక్తిని గోనే సంచిలో కట్టి తీసుకొని వచ్చారు. నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story