ఫస్ట్‌ టైం పీరియడ్‌.. కడుపులో తీవ్ర నొప్పి.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య

ముంబయిలో 14 ఏళ్ల బాలిక తన మొదటి పీరియడ్‌ నొప్పితో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

By అంజి
Published on : 30 March 2024 8:42 AM IST

Mumbai teen, suicide, period stress, Crime

ఫస్ట్‌ టైం పీరియడ్‌.. కడుపులో తీవ్ర నొప్పి.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య

ముంబయిలో 14 ఏళ్ల బాలిక తన మొదటి పీరియడ్‌ నొప్పితో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలికకు రుతుచక్రం గురించి ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఆమె తీవ్ర చర్య తీసుకోవలసి వచ్చింది. ఈ ఘటన మార్చి 26న ముంబైలోని మలాడ్‌లో జరిగింది. టీనేజర్ తన మొదటి పీరియడ్ గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఆమె విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నట్లు చెప్పింది.

ఋతుస్రావం కారణంగా నొప్పిని తట్టుకోలేక బాలిక మనస్తాపానికి గురై, ఆ తర్వాత గదిలో ఉరివేసుకుని చనిపోయిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబీకులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే ఆమె ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని ప్రకటించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద కారణాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.

పోలీసులు ఇప్పుడు బాలిక కుటుంబ సభ్యులు, పాఠశాల, స్థానికుల నుండి ఆమె స్నేహితుల వాంగ్మూలాలను తీసుకోనున్నారు. ఈ సంఘటన టీనేజర్లలో ఋతు చక్రం గురించి తెలియకపోవటం, తప్పుడు సమాచారంపై ఆందోళన కలిగించింది. రుతుక్రమం గురించి, దానిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో యుక్తవయస్కులతో సరైన కౌన్సెలింగ్ కలిగి ఉండవలసిన అవసరాన్ని కూడా ఇది నొక్కి చెబుతుంది.

Next Story